హలో నేను మీ సుమతి…జొమాటో కి జరిమానాను ఎందుకు విధించారు? వివిధ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత తగ్గనున్నాయి ? మలేషియా-సింగపూర్ టూర్ కోసం IRCTC తీసుకువచ్చిన ప్రత్యేక ప్యాకేజీ డీటైల్స్ ఏమిటి? ఇలాంటి మరెన్నో విశేషాలు మన లంచ్ బాక్స్ లో..
నేటి నుంచి గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
నెల మొదటి రోజే సామాన్యులకు ఊరట లభించింది. IOC నుండి అందిన సమాచారం ప్రకారం, గ్యాస్ సిలిండర్ల ధర భారీగా తగ్గింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ముప్పై రెండు రూపాయలు తగ్గింది. ఢిల్లీలో ఇప్పుడు ధర రూ.30.50 తగ్గి 1764.50కి చేరుకుంది. ఇంతకు ముందు ఇది రూ.1795 ఉండేది. కోల్కతాలో సిలిండర్ ధర 32 రూపాయిలు తగ్గడంతో 1879 రూపాయలకు సిలిండర్ అందుబాటులో ఉంది. గతంలో దీని ధర 1911రూపాయలు. ఇక ముంబైలో సిలిండర్ ధర 1749 రూపాయలు నుంచి 31.50 రూపాయలు తగ్గి 1717.50 రూపాయలు కి చేరింది. చెన్నైలో సిలిండర్ 1930కి లభిస్తుండగా.. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇది ఢిల్లీలో 803రూపాయలు, కోల్కతాలో 829రూపాయలు, ముంబైలో 802.50 రూపాయలు , చెన్నైలో 818.50 రూపాయలు కి అందుబాటులో ఉంది.
ఇక విమాన ప్రయాణం చౌక!
విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎందుకంటే మరోసారి విమాన ఇంధనం ధర తగ్గింది. ఈ తగ్గింపు ఈరోజు.. అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం, నేటి నుండి ఢిల్లీలో ATF కిలోలీటర్కు రూ.1,00,893.63 రూపాయలకు లభిస్తుంది. అంతకుముందు మార్చిలో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్కు రూ.1,01,396.54 ఉంది. అంటే ఈరోజు నుంచి ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్కు 502.91 రూపాయలు తగ్గింది. ఈ తగ్గింపు తర్వాత ముంబై, కోల్కతా, చెన్నైలలో ఏటీఎఫ్ ధరలు కిలోలీటర్కు 342.81రూపాయలు , 398.22 రూపాయలు , 425.27రూపాయలు తగ్గాయి.
Zomatoకు ₹23.26 కోట్లు జరిమానా
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటోకు.. కర్ణాటక ఆదాయ పన్ను శాఖ అధికారుల నుండి రూ.23.26 కోట్ల జరిమానాకు సంబంధించిన నోటీసు వచ్చింది. కంపెనీ ఆదివారం ఒక ఎఖ్స్ ఛేంజ్ ఫైలింగ్లో ఈ సమాచారాన్ని ఇచ్చింది. అయితే, కంపెనీ ఈ ఆర్డర్పై అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, వడ్డీ పెనాల్టీ, అధిక లాభానికి సంబంధించి.. డిమాండ్ ఆర్డర్ను అందుకున్నట్లు Zomato తెలిపింది.
SBI డెబిట్ కార్డ్ ఉన్నవారికి అలెర్ట్!
SBI కొన్ని డెబిట్ కార్డుల యాన్యువల్ ఫీజును 75 రూపాయలు పెంచింది. ఈ పెంపు తర్వాత, క్లాసిక్-సిల్వర్-గ్లోబల్-కాంటాక్లాస్ డెబిట్ కార్డ్ వార్షిక ఫీజు 125 రూపాయలకు బదులుగా 200 రూపాయలు అవుతుంది. దీనికి జీఎస్టీ అదనం. నేటి నుండి.. అంటే ఏప్రిల్ 1 నుండి, AURUM, Elite, Elite Advantage, Pulse, SimplyClICK వంటి నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ల కోసం అద్దె చెల్లింపు లావాదేవీలపై బ్యాంక్ రివార్డ్ పాయింట్లను ఇవ్వదు. ఇది SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులందరిపైనా ప్రభావం చూపిస్తుంది.
IRCTC మలేషియా-సింగపూర్ స్పెషల్ ప్యాకేజ్
దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, IRCTC వివిధ జాతీయ , అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలను అందిస్తూనే ఉంది. అటువంటి మరో టూర్ ప్యాకేజీ గురించి మేం మీకు చెబుతాం. ఇది సింగపూర్-మలేషియా టూర్ ప్యాకేజీ. ఇది చెన్నై నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్రత్యేక ప్యాకేజీ 6 పగళ్లు, 5 రాత్రుళ్లు ఉంటుంది. ఇందులో, మీరు సింగపూర్ , మలేషియాలోని అనేక ప్రసిద్ధ ప్రదేశాలను చూడవచ్చు. ప్యాకేజీ ఏప్రిల్ 27, 2024న ప్రారంభమవుతుంది. పర్యాటకులు చెన్నై నుండి కౌలాలంపూర్కు నేరుగా విమానంలో చేరుకుంటారు . ఈ ప్యాకేజీలో, మీరు ప్రతీ చోటా బస చేయడానికి 3 స్టార్ హోటళ్ల సౌకర్యాన్ని కల్పిస్తారు. సింగిల్ ఆక్యుపెన్సీ కోసం మీరు ఒక్కొక్కరికి రూ. 1,52,500 చెల్లించాలి. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.1,28,000, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.1,26,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల సదుపాయాం ఉంది.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.