రుణాలు తీసుకున్న భారతీయ కుటుంబాల సంఖ్య ఒక్క ఏడాదిలో డబుల్ : మనీ9 సర్వే
దాదాపు 21 శాతం భారతీయ కుటుంబాలు వచ్చే ఏడాదిలోగా రుణం తీసుకోవాలనుకుంటున్నట్లు మనీ9 ఇండియాస్ పల్స్.. పర్సనల్ ఫైనాన్స్ సర్వేలో తేలింది. కరోనా తర్వాత దేశంలో రుణాల
దాదాపు 21 శాతం భారతీయ కుటుంబాలు వచ్చే ఏడాదిలోగా రుణం తీసుకోవాలనుకుంటున్నట్లు మనీ9 ఇండియాస్ పల్స్.. పర్సనల్ ఫైనాన్స్ సర్వేలో తేలింది. కరోనా తర్వాత దేశంలో రుణాల డిమాండ్లో బలమైన పెరుగుదల ఉంది. ఇది రిజర్వ్ బ్యాంక్ గణాంకాలలో స్పష్టంగా కనిపిస్తోంది. మనీ9 చేసి సర్వే లెక్కలలోనూ ఇదే విషయం నిర్థారణ అయ్యింది. మనీ9 నిర్వహించిన సర్వే ప్రకారం, గత ఏడాది కాలంలో దేశంలో రుణాలు తీసుకుంటున్న భారతీయ కుటుంబాల సంఖ్య రెట్టింపు అయింది. భారతదేశంలో 22 శాతం కుటుంబాలు రుణాలు తీసుకున్నట్లు ఈ ఏడాది ఆగస్టు-నవంబర్ మధ్య నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2022లో రుణాలు తీసుకున్న భారతీయ కుటుంబాల సంఖ్య 11 శాతం. అంటే ఒక్క ఏడాదిలోనే వీరి సంఖ్య రెట్టింపు అయ్యింది.
Money9 పర్సనల్ ఫైనాన్స్ సర్వే ప్రకారం, గత సంవత్సరంలో 11 శాతం భారతీయ కుటుంబాలు వ్యక్తిగత రుణం తీసుకున్నట్లు తేలింది. 8 శాతం కుటుంబాలు గృహ రుణం తీసుకున్నాయి. 4 శాతం ఆటో రుణం, 2 శాతం విద్యా రుణం తీసుకున్నాయి. . తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లలో అత్యధిక కుటుంబాలు వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నాయి. వాహన రుణాల విషయంలో మహారాష్ట్ర, చండీగఢ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ముందున్నాయి.
దాదాపు 21 శాతం భారతీయ కుటుంబాలు వచ్చే ఏడాదిలోగా రుణం తీసుకోవాలనుకుంటున్నట్లు సర్వేలో తేలింది. వచ్చే ఏడాది, 10 శాతం భారతీయ కుటుంబాలు గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నాయి, ఇందులో ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ముందున్నాయి. వచ్చే ఏడాది, 5 శాతం మంది ప్రజలు వాహన రుణం కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ముందంజలో ఉన్నాయి.
మనీ9 సర్వేలో అందిన సమాచారం రిజర్వ్ బ్యాంక్ గణాంకాలతో పూర్తిగా సరిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్ చివరి వరకు, వ్యక్తిగత రుణాల వృద్ధి దాదాపు 30 శాతంగా ఉంది. వీటిలో గృహ, క్రెడిట్ కార్డ్ రుణాలు, వాహన రుణాలలో అత్యధిక వృద్ధి నమోదైంది.
మనీ9 పర్సనల్ ఫైనాన్స్ సర్వే ఆగస్టు నుండి నవంబర్ వరకు దేశంలోని 20 రాష్ట్రాల్లోని 115 కంటే ఎక్కువ జిల్లాల్లో నిర్వహించారు. ఈ సర్వే 10 వేర్వేరు భాషలలో నిర్వహించారు. ఇందులో దేశంలోని 1140 గ్రామాలు లేదా పట్టణ వార్డులు ఉన్నాయి. ఈ సర్వే భారతీయుల ఆదాయం, ఖర్లు, పొదుపు, పెట్టుబడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.
Published: December 26, 2023, 18:07 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.