2023-24 చక్కెర సంవత్సరంలో, చక్కెర ఉత్పత్తి మునుపటి సంవత్సరంతో పోలిస్తే తగ్గింది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ISMA) ప్రకారం, ఫిబ్రవరి 15 నాటికి దేశవ్యాప్తంగా 223 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయ్యింది. ఈ చక్కెర సంవత్సరంలో ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించినా, చక్కెర ఉత్పత్తిలో దాదాపు 2.5 శాతం తగ్గుదల కనిపించింది. చక్కెర సంవత్సరం అక్టోబర్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది..
మొత్తం షుగర్ ఇయర్ కు చక్కెర ఉత్పత్తి 10 శాతం తగ్గి 330.5 లక్షల టన్నులకు చేరుకుంటుందని ISMA ఆందోళన వ్యక్తం చేసింది… అయితే, సీజన్ ప్రారంభంలో అంచనా వేసిన 291.5 లక్షల టన్నులతో పోలిస్తే, ఈ సంఖ్య గణనీయంగా మెరుగ్గా ఉంది. చక్కెర ఉత్పత్తిలో తగ్గుదల, ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు ఏమిటి? ఈ రంగానికి ఎలాంటి సవాళ్లు ఉన్నాయి? ఔట్ లుక్ అంటే ఏమిటి? ఈ రంగంలో పెట్టుబడికి అవకాశాలు ఉన్నాయా? దీని గురించి డీటైల్డ్ గా చూద్దాం.
భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువగా చక్కెర ఉపయోగించే దేశం. బ్రెజిల్ తర్వాత దీనిని ఎక్కువగా ఉత్పత్తి చేసేది మనమే. దేశీయ వినియోగం 280 లక్షల టన్నులు. 50 లక్షల టన్నుల క్యారీఓవర్ స్టాక్లను కలిపితే, ఈ షుగర్ ఇయర్ లో 100 లక్షల టన్నులు అదనంగా ఉంటుంది. ఈ రంగానికి ప్రోత్సాహం చక్కెర లభ్యత పెరుగుతుండడంతో.. అసలైన ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ కోసం తన డిమాండ్ ను మరోసారి పెంచుకుంది.
భారతదేశంలో, ఇథనాల్ ను పెట్రోల్ తో కలిపే కార్యక్రమాన్ని 2003లో ప్రారంభించింది. దీనిని బ్లెండింగ్ అని పిలుస్తారు. 2014 నుండి, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం బాగా సపోర్ట్ చేసింది. జూన్ 2022లో, మన దేశం 10% మిశ్రమాన్ని సాధించి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత, 20% బ్లెండింగ్ లక్ష్యాన్ని 2030-31 నుండి 2025-26కి కుదించింది.
డిసెంబర్ 7, 2023న, చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసాన్ని ఉపయోగించడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. B లేదా C గ్రేడ్ మొలాసిస్ నుండి ఇథనాల్ ను ఉత్పత్తి చేయమని వారికి సూచించింది. ఇలా ఎందుకు చేసిందంటే.. చక్కెర ఉత్పత్తిలో 11.5 శాతం తగ్గుదల ఉంటుంది. ఏడాది పొడవునా ఉత్పత్తి, సరఫరా కొరత వల్ల, చక్కెర ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే.. డిసెంబర్ 15న, 10 రోజులలోనే, ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఇథనాల్ ఉత్పత్తి కోసం 17 లక్షల టన్నుల చక్కెరను కేటాయించడానికి ఆమోదించింది. ఇది మునుపటి అంచనా 31 లక్షల టన్నుల కంటే తక్కువ. ప్రభుత్వం నిర్ణయం.. మొత్తం పరిశ్రమలో ఆందోళన, గందరగోళానికి దారితీసింది. ఎందుకంటే ప్రతీ సంవత్సరం, షుగర్ ఇయర్ లో చక్కెర మిల్లులు.. ఎంత శాతం చెరకును ఇథనాల్ కోసం కేటాయించాలో గణించడానికి వెయిట్ చేస్తాయి.
కానీ ఈ సంవత్సరం, ఈ సంఖ్య గత సంవత్సరంతో పోల్చితే సగం కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. 2022-23లో, 38 లక్షల టన్నుల చక్కెరను ఉపయోగించారు. ఇది 2021-22లో 31 లక్షల టన్నుల కంటే ఎక్కువ.ఈ సంవత్సరం, సెప్టెంబర్ 2024 నాటికి, అనగా, షుగర్ ఇయర్ 2023-24 చివరి నాటికి, చక్కెర స్టాక్ 78 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేశారు. ఇది ఈ ఏడాది ప్రారంభ స్టాక్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అదనంగా ఉన్న 14 లక్షల టన్నుల చక్కెర ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇక క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ సంవత్సరం ప్రారంభ స్టాక్ కంటే ఎక్కువుగా ఉంటుంది.
ISMA ప్రకారం, నిషేధం వల్ల కలిగే పరిణామాలను నివారించాలంటే.. 30-50 లక్షల టన్నుల బఫర్ స్టాక్ ను ఉంచడం వంటి మధ్యస్థ, దీర్ఘకాలిక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవాలి. అదనంగా, చక్కెర ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకోవాలి. దీనిని స్థిరంగా ఉంచేలా చూడాలి. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ లో పరిశ్రమ గణనీయంగా పెట్టుబడి పెట్టింది. CRISIL ప్రకారం, ఇథనాల్ విక్రయాలు ప్రారంభమైనప్పటి నుండి చక్కెర మిల్లుల మార్జిన్లలో గణనీయమైన మెరుగుదల ఉంది, ఇది చాలావరకు చక్కెర ధరలపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం, మొత్తం బ్లెండింగ్ కోసం.. ఇథనాల్ సరఫరాలో 90% కంటే ఎక్కువ భాగం డిస్టిలరీల నుండి వస్తుంది. 73% చక్కెర మిల్లుల నుండి, మిగిలినది ధాన్యం ఆధారిత డిస్టిలరీల నుండి వస్తుంది.
ప్రస్తుతం, చక్కెర మిల్లుల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 850 కోట్ల లీటర్లు. 2025 నాటికి దాదాపు 1100 కోట్ల లీటర్లకు పెరుగుతుందని అంచనా. ఇలా అయితే 20 శాతం బ్లెండింగ్ టార్గెట్ రీచ్ అవుతుంది. అయితే, ప్రభుత్వం విధించిన నిషేధం ప్రభావం దీనిపై ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.
ఈ రంగంలో ప్రస్తుతం పెట్టుబడి అవకాశాలు ఉన్నాయా అనేది అతిపెద్ద ప్రశ్న. అవును అయితే, ఎక్కడ? బజాజ్ హిందుస్థాన్ షుగర్ తో పాటు, గత ఆరు నెలల నుంచి ఏడాది కాలంగా వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏ షుగర్ కంపెనీ షేర్లలో చెప్పుకోదగ్గ ర్యాలీ జరగలేదు. అయినా చాలా షేర్లు గత ఐదేళ్లలో బాగానే పనిచేశాయి.
స్టాక్ మార్కెట్ నిపుణుడు రవి సింగ్ ప్రకారం, షుగర్ ఇయర్ చివరిలో ఎక్కువ మిగులు ఉన్నా, చక్కెర ధరల్లో కిలోకు 2-4 రూపాయల కంటే ఎక్కువ వ్యత్యాసం ఉండదు. ఈ సెక్టార్లోని కంపెనీల షేర్లలో తగ్గుదల లేదా పెరుగుదల… 6 నుంచి 9 నెలల కోణంలో చూస్తే, బజాజ్ హిందుస్థాన్లో 50 రూపాయలు, శ్రీ రేణుకా షుగర్స్ లో 60 రూపాయలు, మగద్ షుగర్ లో 700 రూపాయలు, దాల్మియా భారత్ షుగర్ లో 500 రూపాయల లక్ష్యాలతో కొనుగోళ్లు చేయవచ్చు అని చెప్పారు.
ఇథనాల్ బ్లెండింగ్ పై ప్రభుత్వం దృష్టి సారించడంతో, చక్కెర మిల్లుల మార్జిన్లలో మెరుగుదల కనిపించింది. భవిష్యత్తులో ఇథనాల్ ఉత్పత్తిలో గణనీయమైన పెట్టుబడికి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపిక చేసిన చక్కెర కంపెనీలు మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాబట్టి, ఎంచుకున్న కంపెనీలను మధ్యస్థం నుండి దీర్ఘకాలిక దృక్పథంతో పోర్ట్ ఫోలియోలో చేర్చుకోవచ్చు.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.