అనూప్ తన ల్యాప్టాప్లో పని చేస్తూ తన స్నేహితుడు సంజయ్ ను గమనించాడు. సంజయ్ టెన్షన్ గా కనిపించాడు. అది చూసిన అనూప్ దానికి కారణం అడిగాడు. సంజయ్ మార్కెట్ గురించి చెప్పాడు. మార్కెట్ బాగా పెర్ఫార్మ్ చేసిందని అనూప్ గుర్తు చేశాడు. మరి ఆందోళన ఎందుకు? అని అడిగాడు. మార్కెట్ బాగా రాణిస్తుందని ఊహించలేదని, ర్యాలీని మిస్ చేసుకున్నానని సంజయ్ చెప్పాడు. అయినా ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదని.. FY25లో మార్కెట్ నుండి మంచి రాబడిని పొందవచ్చని అనూప్ అతనిని ఓదార్చాడు. ఇప్పుడు సంజయ్ ఔట్లుక్ గురించి ఉత్సాహంగా ఉన్నాడు. రాబోయే దృక్పథాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నాడు.
సంజయ్ లాగా, మీరు కూడా 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ ర్యాలీని కోల్పోయారా.. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మీరు FY25 కు మార్కెట్లో పెట్టుబడి వ్యూహం గురించి తెలుసుకోవాలనుకుంటే.. మేము మీ కోసం ఈ రహస్యాన్ని చెబుతాం. అయితే ముందుగా ఎఫ్వై24లో మార్కెట్ పనితీరు గురించి చెప్పుకోవాలి. అప్పుడే మార్కెట్ పరిస్థితి గురించి మీకు పూర్తిగా అర్థం అవుతుంది.
గత ఆర్థిక సంవత్సరం అంటే FY24 భారతీయ మార్కెట్లకు చాలా బాగుంది… FY24లో, నిఫ్టీ-50 ఇండెక్స్ 28% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ పనితీరు కనబరిచిన మార్కెట్లలో ఒకటిగా మిగిలిపోయింది. అయితే జపాన్ మార్కెట్ Nikkei ఇండెక్స్ లా కాదు. రిటర్న్స్ పరంగా చూస్తే నిఫ్టీ.. ప్రపంచంలోని అన్ని ప్రధాన సూచికల కన్నా మంచి పనితీరును కనబరిచింది.
రాబడుల పరంగా ప్రపంచంలోని అత్యుత్తమ మార్కెట్లలో ఒకటిగా కాకుండా, FY24లో నిఫ్టీ గత 10 ఏళ్లో రెండో అత్యుత్తమ పనితీరును కనబరిచింది… FY21లో దాదాపు 71 శాతం రాబడుల తర్వాత చూస్తే.. ఒక దశాబ్దంలో నిఫ్టీ అత్యుత్తమ పనితీరు ఇదే అని చెప్పాలి.
నిఫ్టీతో పోలిస్తే మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీల రాబడులు మరింత అద్భుతంగా ఉండడాన్ని కూడా గమనించాలి. అంటే దిగ్గజాల కంటే చిన్న మధ్య తరహా స్టాక్ల ఇండెక్స్ పనితీరు మెరుగ్గా ఉందని అర్థం. FY24 సమయంలో పవర్ రైల్వేలు, ప్రభుత్వం, క్యాపిటల్ గూడ్స్ వంటి థీమ్లు చాలా యాక్టివ్గా ఉన్నాయి, ఇందులో ప్రజలు చాలా డబ్బు సంపాదించారు. ఈ థీమ్లు చాలా ఏళ్లుగా అంత బాగా లేవు.
FY24లో మంచి పనితీరు కనబరుస్తున్న రంగాల జాబితాలో రియల్టీ ఇండెక్స్ పేరు సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఇండెక్స్ సానుకూల రాబడులను అందించినా, రియల్ ఎస్టేట్ ఇండెక్స్లో 2 రెట్ల కంటే ఎక్కువ జంప్ కనిపించింది. BSE.
ఇప్పుడు మనం ఈ మంచి పనితీరు వెనుక ఉన్న కారణాన్ని కూడా అర్థం చేసుకుందాం. మార్కెట్ మంచి పనితీరుకు కారణం మూడు కేటగిరీల నుండి పెట్టుబడి పెట్టడమే. ఈ మూడు విభాగాలలో ఉన్నది విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు, ముఖ్యంగా రిటైల్ పెట్టుబడిదారులు. FY24లో, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్లలో రూ. 2 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టారు, ఇది గత రెండేళ్లలో అంటే FY22, FY23 కలిపి రూ. 2 లక్షల కోట్ల కంటే ఎక్కువ.
అధిక వాల్యుయేషన్లు , పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవలసి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుదల తర్వాత స్థిరత్వం వచ్చింది. అదే సమయంలో, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు గత 3 ఆర్థిక సంవత్సరాలుగా రూ. 2 లక్షల కోట్లకు పైగా నిరంతరం పెట్టుబడి పెట్టారు… మ్యూచువల్ ఫండ్స్ గురించి పెరుగుతున్న అవగాహన, మార్కెట్ మంచి పనితీరు కారణంగా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే SIP ద్వారా పెట్టుబడులు వస్తున్నాయి. ఇవి నిరంతరం పెరుగుతున్నాయి.
దేశంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థ అయిన AMFI ప్రకారం, జనవరి 2024 వరకు, సుమారు 8 కోట్ల SIP ఖాతాలు చురుకుగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో, SIP ద్వారా పెట్టుబడి సంఖ్య మొదటిసారిగా 19,000 కోట్ల రూపాయలను దాటింది. ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీల లిక్విడిటీని పెంచింది. ఈ డబ్బును మార్కెట్లో పెట్టుబడి పెట్టడం..లో వారికి ఆప్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కోవిడ్ తర్వాత మార్కెట్లో కొనసాగుతున్న మంచి పనితీరు.. రిటైల్ ఇన్వెస్టర్లలో విశ్వాసం, ఉత్సాహాన్ని పెంచింది. NSE డేటాను చూస్తే.. 2019 నుండి 2023లో అంటే 5 ఏళ్లలో 12 కోట్ల మందికి పైగా కొత్త ఇన్వెస్టర్లు నమోదు చేసుకున్నారు. ఈ కాలంలో నిఫ్టీ 104% రాబడిని ఇచ్చింది. ఒక్క జనవరి 2024లోనే 54 లక్షల మందికి పైగా కొత్త ఇన్వెస్టర్లు నమోదు చేసుకున్నారు. డేటా ప్రకారం, రిటైల్ పెట్టుబడిదారులు మొత్తం రూ. 30 లక్షల కోట్ల విలువైన షేర్లను కలిగి ఉన్నారు. ఇది మార్కెట్లో జాబితా అయిన కంపెనీల మొత్తం విలువలో 7.7%.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, FY25 ఔట్లుక్ ఎలా ఉంది? FY25లో మార్కెట్ పనితీరు FY24 మాదిరిగానే ఉంటుందా? FY25 ఔట్లుక్ గురించి తెలుసుకునే ముందు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అతిపెద్ద ట్రిగ్గర్లు ఏమిటో తెలుసుకుందాం. జూన్ 4న రానున్నసార్వత్రిక ఎన్నికల ఫలితాలు భారత మార్కెట్లకు స్వల్పకాలిక, అత్యంత ముఖ్యమైన ట్రిగ్గర్. ఇందులో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మార్కెట్ భావిస్తోంది. దీనివల్ల, ఎన్డిఎ ప్రభుత్వ విధాన నిర్ణయాలు, జిడిపి వృద్ధి రెండూ కొనసాగుతాయని భావిస్తున్నారు.
ఇది కాకుండా, US ఫెడ్తో సహా ప్రపంచంలోని ఇతర సెంట్రల్ బ్యాంక్లు తగ్గించిన రేటు.. దేశీయ, ప్రపంచ మార్కెట్లకు పెద్ద ట్రిగ్గర్. ఇది భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, పెట్టుబడిని పెంచుతుందని అంచనా వేయవచ్చు. అయితే, కంపెనీల త్రైమాసిక ఫలితాల్లో మెరుగుదల.. అంటే కార్పొరేట్ ప్రపంచ వృద్ధి కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అంతిమంగా కంపెనీల త్రైమాసిక ఫలితాల మెరుగుదలపైనే షేర్ల పెరుగుదల, మదింపు ఆధారపడి ఉంటుంది. వీటన్నింటికీ మధ్యలో ఒకే ఒక సవాలు ఉంది. అదే రాజకీయ అనిశ్చితి. ప్రస్తుతం ప్రపంచంలో రెండు పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి.
అవి…ఒకటి రష్యా-ఉక్రెయిన్ మధ్య.. మరొకటి హమాస్-ఇజ్రాయెల్ మధ్య. ఈ రెండింటిలో ఏ యుద్ధం పెద్దదైనా.. దాని జ్వాలలు ప్రపంచంలోని అనేక దేశాలను ఆర్థికంగా, మానసికంగా దహించవచ్చు.
FY25లో మార్కెట్కు ట్రిగ్గర్లు ఏమిటి ? రాబోయే సంవత్సరానికి ఔట్లుక్ , లక్ష్యాలు ఏమిటి?
చాలా మంది బ్రోకర్లు ఇప్పటికీ భారతీయ మార్కెట్లపై బుల్లిష్గా ఉన్నారు. 2024 చివరి నాటికి నిఫ్టీకి 23,000 నుండి 30,000 వరకు టార్గెట్లను ఇస్తున్నారు, ఇది ప్రస్తుత స్థాయి 22,400 కంటే 3 నుండి 33 శాతం ఎక్కువ.
ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, FY25లో ఏ రంగాలు, షేర్లు లేదా అసెట్ క్లాస్లలో పెట్టుబడి పెట్టాలి?
సంజయ్ లాగా, మీరు కూడా FY25.. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఔట్లుక్ ఏమిటో.. పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఎక్కడ డబ్బు సంపాదించవచ్చో అర్థం చేసుకోవాలి… కాబట్టి, పెట్టుబడి సలహాదారుని సలహా తీసుకోండి. ఈ ఆర్థిక సంవత్సరానికి మార్కెట్ వ్యూహాన్ని సిద్ధం చేయండి. దీర్ఘకాలికంగా… షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టడం రిస్క్ అనుకుంటే.. పెట్టుబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. అలాగే, పోర్ట్ఫోలియోను వైవిధ్యంగా ఉంచడానికి.. అంటే రిస్క్ని తగ్గించడానికి, వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టాలి.