2023 సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో వాల్యూమ్లో 6.4% పెరుగుదల వల్ల, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటే FMCG పరిశ్రమ విలువ 6% పెరిగింది. నీల్సన్ రిపోర్ట్ ప్రకారం, వాల్యూమ్ పెరుగుదల వల్ల తెలిసేదేంటంటే.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వినియోగ స్థాయి పెరిగింది అని అర్థం. జాతీయస్థాయిలో FMCG ఉత్పత్తులకు బలమైన డిమాండ్ ఉందని తెలుస్తోంది. కానీ ఈ కాలంలో త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంలో స్వల్ప తగ్గుదల వల్ల వాల్యూమ్ వృద్ధిలో మందగమనం ఉంది. FMCG కంపెనీలు గ్రామీణ డిమాండ్లో క్రమంగా వృద్ధి తగ్గుతుండడంపై సిగ్నల్స్ ఇచ్చాయి. ఇంతకీ భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల నుండి FMCG కంపెనీలు ఎలాంటి డిమాండ్ను కోరుకుంటున్నాయి? ఇప్పుడు ఈ ప్రాంతాలకు ఎఫ్ఎంసిజీ కంపెనీల వ్యూహం ఏమిటి? ఈ రంగానికి చెందిన కంపెనీలలో వ్యూహం ఎలా ఉండాలి? దీనిని డీటైల్డ్ గా అర్థం చేసుకుందాం.
FMCG భారత ఆర్థిక వ్యవస్థలో నాలుగో అతిపెద్ద రంగం. ఈ రంగంలో 3 ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఈ రంగంలో కలిగిన ఆహారపానీయాల వాటా 19%, ఆరోగ్య సంరక్షణ వాటా 31%, గృహ, వ్యక్తిగత సంరక్షణతో పాటు మిగిలిన వాటి వాటా 50% ఉన్నాయి. ఈ రంగం ఆదాయంలో 55% పట్టణ ప్రాంతాల నుండి, 45% గ్రామీణ ప్రాంతాల నుండి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి అధిక డిమాండ్ ను FMCG కంపెనీలు ఆశించడం లేదు. ఎందుకంటే కమోడిటీ ధరల పతనం, GDP వృద్ధిలో పెరుగుదల FY24 మూడవ త్రైమాసికంలో చాలా FMCG కంపెనీల ఆదాయ వృద్ధి మందగించింది.
అయితే పంటలకు ఎంఎస్పీ సహా పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు.. ఎన్నికలకు ముందు చేస్తున్న ఖర్చు… గ్రామీణ వ్యయం పెరుగుతుందని అంచనా వేశాయి. ఎన్నికల వ్యయం వల్ల.. గ్రామీణ ప్రాంతాల వినియోగంలో పెరుగుదలపై ఈ కంపెనీలకు పెద్దగా అంచనాలు లేవు.
వాస్తవానికి, మార్చి బులెటిన్లో, రాబోయే 6 నెలల్లో దేశీయ ఎఫ్ఎంసిజి సెక్టార్లో మందగమనాన్ని ఆర్బిఐ అంచనా వేసింది. కానీ మరోవైపు, ప్రీమియం వినియోగదారుల వ్యాపారానికి బలమైన డిమాండ్ను కూడా హైలైట్ చేసింది. అంటే ఇందులో ప్రీమియం ఉత్పత్తులను విక్రయిస్తే.. ఈ రంగంలో పెద్ద మార్పు రాబోతోంది. భారత తలసరి ఆదాయంలో పెద్ద మార్పు రాబోతోందని ఆర్బీఐ కూడా తన బులెటిన్లో పేర్కొంది. దీని ప్రకారం ప్రీమియం, అధిక ఆదాయం కొనుగోలుదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. గత 2 సంవత్సరాలలో ఈ రంగంలో దిగ్గజం అయిన హిందుస్థాన్ యూనీలీవర్ తాను ప్రారంభించిన ఉత్పత్తులలో 70% కంటే ఎక్కువ ప్రోడక్ట్ లను ప్రీమియం కేటగిరీలోనే లాంఛ్ చేసింది.
కొవిడ్కు ముందు, FMCG కంపెనీలు మధ్య, దిగువ భాగంలో వివిధ రకాల ఉత్పత్తులను పెంచేవి. దీంతో ప్రజలను కొత్త రకాల ఉత్పత్తుల కోసం ఆకర్షించేవారు. ఇప్పుడు మాస్ స్థాయికి బదులుగా ప్రీమియం ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. కాబట్టి, ఈ కంపెనీలు తమ వ్యూహాన్ని ఏమైనా మార్చుకున్నాయా? ఎందుకంటే అర్బన్ ఏరియాల్లో ఇప్పుడు చాలా వస్తువులు ఆన్లైన్లో ఎక్కువగా దొరుకుతున్నాయి. అందుకేనేమో జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఏం చెప్పారంటే.. బ్లింకిట్ తన మాతృ సంస్థ జొమాటో కంటే ఏడాదిలో పెద్దదిగా మారుతుందని… ప్రజలు బయటి నుంచి ఆహారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉండటమే దీనికి కారణం అని అన్నారు. మీరు ఫుడ్ ఆర్డర్ చేసినా చేయకపోయినా, మీరు కచ్చితంగా ఇతర ఆహార పదార్థాలను ఆన్ లైన్ ఆర్డర్ చేస్తారన్నారు.
వీటన్నింటి దృష్ట్యా ఎఫ్ఎంసిజి కంపెనీలు తమ మోడల్స్ను మారుస్తాయా? గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి, డిమాండ్ పరిమితంగా ఉంటుందా? దీనిపై స్టాక్ మార్కెట్ నిపుణుడు అంబరీష్ బలిగా ఏం చెప్పారంటే.. ఆర్బిఐ బులెటిన్ తక్కువ-స్థాయి ఎఫ్ఎంసిజి ఉత్పత్తులు, ముఖ్యంగా గ్రామీణ, ప్రీమియం ఉత్పత్తుల మధ్య అంతరాన్ని ప్రతిబింబిస్తుందని… మరో మాటలో చెప్పాలంటే, ఇది ధనికులు, పేదల మధ్య పెరుగుతున్న ఆదాయ విభజనకు సంకేతం అని అన్నారు. FMCG కంపెనీలు తక్కువ ఎంట్రీ లెవల్ ప్యాక్లను అలాగే ‘బ్రిడ్జ్ ప్యాక్లను’ ఆకర్షణీయంగా మార్చేందుకు వాటి ధర, బరువును తగ్గించాయి. FMCG కంపెనీలు నిరంతరంగా పెద్ద ప్రోడక్ట్ బాస్కెట్పై అంటే నిర్దిష్ట ప్యాకెట్లపై దృష్టి సారిస్తున్నాయి. డిమాండ్ బలంగా ఉన్న చోట ఫోకస్ పెడుతున్నాయి. ఇది మార్జిన్లపై స్టార్టింగ్ లో ఒత్తిడిని తెవ్చు. కానీ సార్వత్రిక ఎన్నికలే ఇప్పుడు ఆశాకిరణం. ఈ కాలంలో, వ్యయం పెరగడం అనేది.. FMCG రంగంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉంటే, గ్రామీణ డిమాండ్లో పెరుగుదలకు అవకాశం ఉంది.
ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని, FMCG కంపెనీలు ఇప్పుడు తమ వ్యూహాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి?
2024 ఆర్థిక సంవత్సరంలో FMCG రంగం 19% రాబడిని ఇచ్చిందని స్టాక్ మార్కెట్ నిపుణుడు అంబరీష్ బలిగా చెప్పారు. ఈ పనితీరుకు బెవరేజ్ షేర్స్ ఎక్కువగా దోహదపడ్డాయి. సెక్టార్లోని మిగిలిన స్టాక్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరును కనబరుస్తాయని భావిస్తున్నారు. దీర్ఘకాలికంగా, ప్రీమియమైజేషన్ కంపెనీల బ్లెండెడ్ మార్జిన్లను మెరుగుపరుస్తుందని.. బాటమ్లైన్లో డిమాండ్లో ఆశించిన మెరుగుదల రాబడి, లాభాల్లో మంచి వృద్ధికి దారితీస్తుందని అంచనా. 1 సంవత్సరం దృష్టికోణంలో, మీరు ITCలో రూ. 525, HUL రూ.2850, డాబర్ రూ.640 లక్ష్యంతో పెట్టుబడి పెట్టవచ్చు.
మొత్తంమీద, ఎఫ్ఎంసిజి కంపెనీలు బలమైన డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై దృష్టిని పెంచుతాయి. అయితే సార్వత్రిక ఎన్నికలలో, సాధారణ వర్షాకాలంలో ఖర్చు పెరగడం వల్ల, ఈ కంపెనీల డిమాండ్ పెరగవచ్చు. కాబట్టి, ఎంచుకున్న స్టాక్స్ లో 12 నెలల కోణంతో పెట్టుబడి పెట్టడానికి వ్యూహం రూపొందించుకోవాలి.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.